ఓటు హక్కు వినియోగించుకున్న గంగూలీ

30brk-gan1కోల్‌కతా: భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంగూలీ కోల్‌కతాలోని బెహలా ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. పశ్చిమ్‌బంగ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు అయిదో విడతలో 53 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పోటీగా భాజపా నుంచి బరిలో ఉన్న నేతాజీ మనవడు చంద్ర బోస్‌ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సింగూర్‌, కోల్‌కతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఉదయం 9 గంటలకు 20శాతం పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం.