ఓపెన్ డిగ్రీ అడ్మిషన్లకు ఈ నెల 30 వరకు గడువు పెంపు.

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త షేక్ కాజా బి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్19 (జనంసాక్షి):
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందుటకు ఈ నెల 30 వరకు గడువు పొడగించబడిందని నాగర్ కర్నూల్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త షేక్ కాజా బి తెలిపారు. కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా రెండేళ్ళ ఐటిఐ లేదా పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారు అంబేద్కర్ సార్వత్రిక డిగ్రీలో సెప్టెంబర్ 30 లోపు అడ్మిషన్ పొందాలని సూచించారు. అదే విదంగా ద్వితీయ, తృతియ సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్ ఫిజు చెల్లించాలన్నారు.మరిన్ని వివరాలకు 7382929779 నంబర్ ను లేదా నెల్లికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సంప్రదించవచ్చని తెలిపారు.