ఓబిసి మోర్చా మండల కమిటీ ఎన్నిక

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జులై 09 (జనంసాక్షి):యాచారం మండల బిజెపి అధ్యక్షులు తాండ రవీందర్ ఆధ్వర్యంలో శనివారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా.. ఓబిసి మోర్చా  మండల  కమిటీని,  కిసాన్ మోర్చా మండల కమిటీలను   ఎన్నుకున్నారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా కలకొండ బీరప్ప (మేడిపల్లి) ను ఎన్నుకోగా.. ఒబిసి మోర్చా మండల అధ్యక్షులుగా పి. నరేష్ (మల్కిజుగూడెం), ఉపాధ్యక్షులుగా సిహెచ్. రమేష్ (చౌదర్పల్లి) ), కే. మురళి (తాడిపర్తి),  అచ్చన చంద్రయ్య (ధర్మన్నగూడ) జి. పాండు (చింతుళ్ళ), ప్రధాన కార్యదర్శులుగా మల్కాపురం కృష్ణ (కొత్తపల్లి),  జి. పెద్దులు (మాల్), గోలి అవినాష్ (తక్కల్లపల్లి),  ఆవుల శ్రీకాంత్ (కురిమిద్ద), కోశాధికారిగా గౌరలింగం (మేడిపల్లి),  సభ్యులుగా బర్ల రాములు (నానక్ నగర్),  సామ శ్రీకాంత్ (నందివనపర్తి),  కర్నాటి నరేష్ (మొండి గౌరెల్లి)కి చెందిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు తాండ్ర రవీందర్ వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ.. ఓబీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ ఓ బీసీలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి జంగయ్య గౌడ్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి గోగికార్ రమేష్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నీలం రమేష్, ఉపాధ్యక్షులు పత్తి రాజు, ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ, బీజేవైఎం మండల కార్యదర్శి బన్నె శివ, రామాచారి తదితరులు పాల్గొన్నారు.