ఓయూ ఐకాస ఆందోళన

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల మరణహోమానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థి ఐకాస మంత్రుల నివాస ప్రాంగాణాన్ని ముట్టడించింది. ఈ సంఘటనకు కారణమైన మంత్రులు బొత్స, కొండ్ర మురళిలను మంత్రివర్గం నుంచి తప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యార్థులను పోలీసుల అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.