కంచగచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు
న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు.ఈ భూములపై ఏప్రిల్‌ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని ఆ అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం క్లియర్‌ కట్‌గా స్పష్టం చేసింది. ఈ భూముల్లోనే సెంట్రల్‌ యూనివర్శిటీ-, మరికొన్ని ఇనిస్టిట్యూట్‌లు, బస్‌ స్టాండులు తదితర సౌకర్యాలు ఎన్నో వచ్చాయని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం సోదాహరణగా వివరించింది. సుమారు 20 ఏళ్లకుపైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు- మొలిచి.. అటవీ ప్రాంతంగా మారిందని ఈ అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం వివాదాస్పదం కావడంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్‌ గత రెండు రోజులుగా ఢల్లీిలోనే ఉండి. సీనియర్‌ న్యాయవాదలతో చర్చించి.. ఈ అఫిడవిట్‌ను సిద్దం చేశారు. సోమవారం దీనిని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షత జరిగింది. మరోవైపు ఉచిత పథకాల కారణంగా ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలిలోని దాదాపు 400 ఎకరాలు వేలం పాట నిర్వహించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలంలో జేసీబీల సాయంతో చెట్లను సైతం నరికి వేయించింది. ఈ విషయం తెలిసిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ- విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలకు దిగారు. వీరి ఆందోళన తీవ్ర తరం చేయడంతో.. ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ సైతం వారికి మద్దతు ప్రకటించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ- విద్యార్థులతో పాటు- ప్రతిపక్షాలు ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లు- నరకవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకోవైపు ఈ భూములపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఓ లేఖ విడుదల చేసింది. 2003లో ఈ భూములను నాటి ఉమ్మడి ఆంధపద్ర్రేశ్‌లోని ప్రభుత్వం ఐఏంజీ సంస్థకు విక్రయించిందని తెలిపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఈ భూములు ప్రభుత్వానికి కేటాయించడంతో.. అందుకు ప్రతిగా ప్రభుత్వం మరో చోట వందలాది ఎకరాలను సెంట్రల్‌ యూనివర్సిటీకి కేటాయించిందని ఆ లేఖలో ప్రభుత్వం సోదాహరణగా వివరించిన సంగతి తెలిసిందే.