కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్ కి మద్దతు ప్రకటించినతెలంగాణ టిడిపి

సికింద్రాబాద్ నవంబర్ 17 ( జనం సాక్షి ) కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు నేపథ్యంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు తమ పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలంగాణ టిడిపి కంటోన్మెంట్ శ్రేణులు స్పష్టం చేశారు.ఈ మేరకు కంటోన్మెంట్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు అనుసారం కంటోన్మెంట్ బిజెపి అభ్యర్ధి శ్రీగణేష్ అభ్యర్ధన మేరకు తాము కంటోన్మెంట్ టిడిపితరపునపూర్తి మద్దతు ఇస్తు శ్రీ గణేష్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాము అన్ని చెప్పారు.ఈకార్యక్రమంలోనాయకులు జనగాం నరసింహ,మధు సూదన్,ప్రతాప్, అంజయ్య,కట్టెల శ్రీనివాస్ యాదవ్, చంద్ర శేఖర్, వెంకట్ రావు,కైలాస్ గౌడ్, రుకేష్,డి.ఆర్. శ్రీను, రాము,ఆనంద్,శ్రీకాంత్,నాగరాజు,పి.శ్రీను,సుదర్శన్,అనురాధ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు