కమల్ పార్టీకి ఇసి గుర్తింపు
న్యూఢిల్లీ,జూన్23(జనం సాక్షి): తమిళ నటుడు కమల్ హాసన్ ఆవిష్కరించిన మక్కల్ నీది మయ్యంకు రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కింది. శనివారం ఎన్నికల కవిూషన్ రాజకీయ పార్టీగా నమోదు చేసింది. వచ్చే వారం ప్రారంభంలో నమోదు ప్రతాలను కమల్కు అందజేస్తోంది. కమల్ హాసన్ దాఖలు చేసిన పత్రాలు ప్రాసెస్ చేశామని, రిజిస్టేష్రన్ మంజూరు చేసినట్లు ఇసి పేర్కొంది. వచ్చే వారంలో దీనికి సంబంధించిన పత్రాలు పొందుతారని, ప్రస్తుతం సాధారణ లేఖను పంపామని సీనియర్ అధికారి తెలిపారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్, ఇతరుల సమక్షంలో కమల్ తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యం (ప్రజల న్యాయ కేంద్రం) ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాథమిక అడ్డంకులు తొలిగాయి. ఇక కమల్ అధికారికంగా పార్టీ నేతగా ముందుకు సాగేందుకు వీలు కలుగనుంది.