కరిగిపోతున్న ఎత్తోండ గుట్టలు.

కరిగిపోతున్న ఎత్తోండ గుట్టలు

కోటగిరి అక్టోబర్18( జనంసాక్షి):-కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ గ్రామ శివారులోని గుట్టలను కొందరు అక్రమంగా మైనింగ్ చేస్తూ ప్రకృతి సంపదను అడ్డంగా దోచేస్తున్నారు.గత కొద్దిరోజులుగా ఎత్తోండ గుట్టను పెద్ద పెద్ద పొక్లెన్ లను ఉపయోగిస్తూ,టిప్పర్లు
,టాక్టర్ల తో రాత్రింబవళ్లు నిర్విరామంగా అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతు న్నారు.మండల పరిధిలోని తాసిల్దార్,జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు అక్రమంగా మైనింగ్ చేస్తున్న అధికారుల వైపు కనీసం చూడకపోవడంతో వారి ఆటలు కొనసా గుతున్నాయని గ్రామస్తులు వాపో యారు.ఈ విషయంపై కోటగిరి అర్.ఐ సయ్యద్ ఆలి కి వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఎవరికి ఇవ్వలేదని,అక్రమంగా మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.