కరీంనగర్ కు మెడికల్ కాలేజీ మంజూరు
గంగుల కు జీవో కాపీ అందజేసిన కేసీఆర్
* నెరవేరిన చిరకాల స్వప్నం
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
150కోట్లతో కరీంనగర్ మెడికల్ కళాశాలలో 100 సీట్లతో తరగతులు నిర్వహించేలా కరీంనగర్ జనరల్ హాస్పిటల్ ని బోధనాస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ మెడికల్ కాలేజీతో అటాచ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
జీవో ప్రతిని ముఖ్య మంత్రి కేసీఆర్ చేతులమీదుగా శనివారం ప్రగతిభవన్ లో మంత్రి గంగుల కమలాకర్ అందుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ మెడికల్ కాలేజీ ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్గ్రేడేషన్ కు పరిపాలన అనుమతులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. దీంతో కరీంనగర్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరినట్లు అయిందని సంతోషం వ్యక్తం చేశారు.