కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కు ఐఎస్ఓ గుర్తింపు
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయం (సిపిఓ) నకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు లభించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు శనివారం నాడు పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ కు ఎంపిక చేశారు. కమిషనరేట్ పోలీస్ కార్యాలయం (సిపిఓ) విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనే కరీంనగర్ కమిషన్ రేట్ ఎంపికైంది
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఐఎస్ఓ గుర్తింపునకు ఎంపిక కావడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ గుర్తింపుతో కమిషనర్ పోలీస్ కార్యాలయం నకు చెందిన అన్ని స్థాయిలకు చెందిన అధికారులు, సిబ్బందిలో నూతన ఉత్సాహం నిండుకుందని చెప్పారు. మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (ఎల్అండ్ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన) ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయకుమార్, సి ప్రతాప్,అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం లతో పాటుగా పలువురు పోలీస్ అధికారులు, మినిస్టీరియల్ విభాగం సిబ్బంది అధికారులు పాల్గొన్నారు