కరోనా వైరస్‌ .. మరొకరి ప్రాణాలను బలి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. వైరస్‌ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి (63) ఆదివారం మృతిచెందారు. అలాగే బిహార్‌ రాజధాని పట్నాలో ఇటీవల ఖతర్‌ నుంచి వచ్చిన ఓ కరోనా బాధితుడు (38) మరణించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.