కర్ణాటకను భాజపా అవినీతిమయం చేసింది

ఎన్నికల సభలో సోనియా
చిక్‌మగళూరు/ మంగళూరు (జనంసాక్షి) : కర్ణాటకను భారతీయ జనతా పార్టీ అవినీతిమయం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అ న్నారు. అధికారమిచ్చిన ప్రజలకు బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆరో పిం చారు. శనివారం ఆమె కర్ణాటకలోని చిక్‌మగళూరు, మంగళూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలలో పాల్గొన్నారు. సరైన పాలన లేక ఇబ్బంది పడుతున్న కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కోసం మార్పు అవసరమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని చెప్పారు. అధికారంలో ఉన్న వ్యక్తుల అనైతిక ప్రవర్తన హద్దులు దాటిపోయిందని అన్నారు. బీజేపీ పాలనలో గనుల మాఫియా రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకుందని, ఛాందసవాదశక్తులు రాష్ట్రంలో భయం, విద్వేషాలను రెచ్చగొట్టి లౌకిక విలువలను దెబ్బతీశాయని ఆరోపించారు. బీజేపీ పాలనవల్ల పలువురు ఇన్వెస్టర్లు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. చిక్‌మగళూరు ప్రజలు తన అత్తను సొంత సోదరీమణిలాగా పరిగణించారని, 35 సంవత్సరాల క్రితం ఆమెను ఇక్కడ గెలిపించారని గుర్తుచేసుకున్నారు. మంగళూరులో మాట్లాడుతూ, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలంటే మార్పు అవసరమని, కాంగ్రెస్‌ను గెలిపించాలని సోనియా కోరారు.