కర్నాటకలో విజయం సాధిస్తున్నాం

                                                                              విూడియా సమావేశంలో అమిత్‌షా
బెంగుళూరు,మే10(జ‌నం సాక్షి):   కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ..స్వాతంత్య్ర భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు కర్ణాటకలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలను తగ్గించిందని పేర్కొన్నారు. కానీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించడంలో విఫలమైందన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్‌ చేసిందేవిూ లేదని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని, ఆ రెండు స్థానాల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.