కర్నాటక బిజెపి నేత దారుణ హత్య

హంతకుల కోసం పోలీసుల గాలింపు

బెంగుళూరు,జూన్‌23(జ‌నం సాక్షి): కర్ణాటకలోని చిక్కమగళూర్‌ బీజేపీ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ అన్వర్‌ దారుణ హత్యకు గురయ్యారు. గౌరి కలువే ప్రాంతంలో గుర్తుతెలియని కొందరు దుండగులు ఆయనపై కత్తులతో దాడిచేశారు. శుక్రవారం రాత్రి 9:30 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అన్వర్‌ ఓ కార్యక్రమానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు ద్విచక్రవాహనాలతో ఆయనను అటకాయించారు. కత్తులతో మూడు సార్లు బలంగా దాడిచేయడంతో ఆయన ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాగా ఈ హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికానప్పటికీ.. వ్యక్తిగత కక్షలే కారణమై ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు.