కలెక్టర్ కు రాఖీ లు కట్టిన శిశుమందిర్ చిన్నారులు.

విద్యార్థులను అభినందించిన కలెక్టర్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి):

గురువారం కలెక్టరేట్లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు రాఖీ పండగ సందర్భంగా రాఖీలు కట్టారు.శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. హృదయ పూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారుఅన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు ప్రసన్న లక్ష్మీ పాల్గొన్నారు.