కల్తీకల్లు తాగి ఒకరి మృతి

రాజాపేట:నల్గొండ జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట శివారులో కల్తీకల్లు తాగిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న రాత్రి కల్తీకల్లు తాగిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇందులో జంగటి శ్రీను (46) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. వీరిద్దరు మెదక్‌ జిల్లాకు చెందినవారు. రాజాపేట పోలీసులు కేసు నమోవు చేసి దర్యాప్తు చేపట్టారు.