కళాశాల సాధనే మా ద్యేయం

రాజోలి ఆగస్టు 13(జనం సాక్షి)
మండల కేంద్రమైన రాజోలి లో జూనియర్ కాలేజీ సాదించడమే తమ ద్యేయమని కళాశాల సాధన సమితి సభ్యులు అన్నారు.శనివారం రాజోలి లోని భ్రమరాంబ ఆడివేశ్వర స్వామి ఆలయం వద్ద సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ని అన్ని గ్రామాల విద్యార్థులు ఉన్నత విద్యను చదవాలంటే తప్పకుండా ఇంటర్ కాలేజి అవసరమని కాలేజీ లేక ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రధానంగా బాలికలు చదువుకు దూరమై చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని అన్నారు.