కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

వీపనగండ్ల 17 ఆగస్టు (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో నూతన పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. బొల్లారం గ్రామానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన పెన్షన్ కార్డులను, మండలంలోని  వివిధ గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను,అనారోగ్యంతో ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 15 మంది లబ్ధిదారులకు 6 లక్షల 12 వేల రూపాయల చెక్కులను  అందజేశారు.మండల కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని సాధ్యమైనంత తొందరగా మంజూరు చేయించి అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ కమలేశ్వర్ రావు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మొత్తం కృష్ణయ్య ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిబాబు మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు,తెరాస నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.