కష్టపడి పని చేసిన వారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో స్థానం దక్కుతుంది

సంస్థాగత ఎన్నికల సమయాత్త సమావేశంలో వెల్లడి
– జిల్లా రిటర్నింగ్ అధికారి నరసింహ
జనగామ (జనం సాక్షి) జూన్ 14 :జనగామ జిల్లా , నియోజకవర్గ, మండలాల గ్రామాల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పని చేసిన వారిని ఏఐసీసీ టిపిసిసి గుర్తిస్తుందని, ఎంత పెద్ద వారైనా కష్టపడి పని చేయవలసిందేనని కాంగ్రెస్ పార్టీలో పైరవీలకు తావులేదని   సభాముఖంగా అన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల సమయత్త సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని డిఆర్ఓ నరసింహ మాట్లాడారు.ప్రతి ఇంటి గడప తడితేనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుందని,గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారిని జిల్లా నియోజకవర్గ మండల పెంటల్ ఆర్గనైజేషన్ , గ్రామస్థాయిలోని ప్రత్యేక హోదా గల నాయకులను ఏ ఐ సీసీ టిపిసిసి అధిష్టానం గుర్తిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్టేషన్గన్పూర్ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఇందిరా పిసిసి మెంబర్ అమృత రావు ముఖ్య నాయకులు ఎర్రమల సుధాకర్,జగదీశ్వర్ రెడ్డి, సుభాష్ రెడ్డి,  సత్యనారాయణ రెడ్డి కంచ రాములు మెడ శ్రీనివాస్ బనుక శివ రాజ్ యాదవ్ దిలీప్ రెడ్డి నర్సింగరావు ఉమాపతి రెడ్డి కౌన్సిలర్లు మల్లేశం రాంచందర్ చందర్రావు స్టేషన్గన్పూర్ జఫర్గడ్ పాలకుర్తి జనగామ మండల బ్లాక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….