కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ రద్దు

ఢిల్లీ: ఈరోజు సాయంత్రం జరగవలసి వున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం రద్దయింది. దాని బదులుగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ముఖాముఖి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పదవుల భర్తీపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.