కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి ఎవరూ మద్దతివ్వలేదదు

బెంగళూరు: అత్యధిక సీట్లు గెలిచిన పార్టీకి ముందుగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటున్నారని, మరి గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్‌ ఎక్కువస్థానాలు గెలిచినా… ప్రభుత్వం ఏర్పాటుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా బీజేపీకి ఎవరూ మద్దతివ్వలేదన్నారు. 104 మంది ఎమ్మెల్యేజేడీఎస్ ల పేర్లు తప్ప… మద్దతిచ్చే వారిపేర్లు బీజేపీ బయటపెట్టలేదని సిద్దరామయ్య పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో బస చేసిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు బయల్దేరనున్నట్లు తెలియవచ్చింది.