కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి పోటీచేసుంటే బాగుండేది

– బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలు ఏకంకావాలి
– కేసీఆర్‌ దారిలో నడిస్తే బీజేపీని ఓడించడం సాధ్యం
– పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ
ముంబాయి, మే15(జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి పోటీచేసి ఉంటే కర్ణాటకలో బీజేపీకి అన్ని స్థానాలు వచ్చేవి కావని, పంథానికి పోయి బీజేపీకి అవకాశం ఇచ్చినట్లయిందని  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కర్నాటక ఫలితాల అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన విజేతలకు అభినందనలు.. ఎవరైతే అక్కడ ఓడిపోయారో.. వారు మళ్లీ యుద్ధం మొదలు పెట్టాలని సూచించారు. కాంగ్రెస్‌ కర్ణాటకలో జేడీఎస్‌ తో పొత్తు పెట్టుకుంటే ఈ ఫలితం మరోలా ఉండేవని, చేజేతులా కాంగ్రెస్‌ పార్టీనే కర్ణాటకలో ఓడిపోయిందన్నారు. మోడీ వ్యతిరేక శక్తులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని.. కేసీఆర్‌ ఆలోచనల్లోంచి వచ్చిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారానే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమని మమత స్పష్టం చేశారు. పట్టింపులకు పోయి కర్ణాటకలో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్‌ దెబ్బతిందని.. మున్ముందు బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న మోడీ అమిత్‌ షాలకు ఫెడరల్‌ ప్రంట్‌ ద్వారా బుద్దిచెప్పాలని మమత సూచించారు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు కలిసి ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీని ఓడించాయని.. అన్నీ ప్రతిపక్ష పార్టీలు ఇలానే బీజేపీని ఎదుర్కోవాలని మమత సూచించారు..
—————-