కాంగ్రెస్ పేరు మార్చుకోవాలి
– మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
భోపాల్, మే15(జనం సాక్షి ) : కాంగ్రెస్ పార్టీ తన పేరు మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్సీ) తన పేరును మార్చుకోవాలి. అందుకు సమయం ఆసన్నమైందన్నారు. కర్ణాటక ఫలితాలే అందుకు నిదర్శనమని, ఐఎన్సీను కాంగ్రెస్(పీఎంపీ-పంజాబ్, మిజోరాం, పుదుచ్చేరి) అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మూడు రాష్ట్రాల మొదటి అక్షరాలు కలిసి వచ్చే విధంగా చౌహాన్ కాంగ్రెస్
పార్టీకు పేరు పెట్టారు.