కాంగ్రెస్ నుండి BRS లో చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి

పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన కాంగ్రెస్ నేత జాటోత్ భాస్కర్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం, రామవరం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రావణ్, ప్రశాంత్ యాదవ్ ల అధ్వర్యంలో 50 మంది BRS పార్టీలో చేరగా, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ గారు, మంత్రి ఎర్రబెల్లి గారు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి BRS పార్టీలో చేరుతున్నాం అన్నారు.

పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి BRS పార్టీని గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేయాలి అన్నారు.