కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 17 కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. టేక్మాల్ మండలంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టేక్మాల్ మండలంలోని కాదులూర్, సాలోజి పల్లి, తంపులూరు, ఏక్లాస్ పూర్, రంగన్నపల్లి, ఏలకుర్తి గ్రామాలకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఎస్పీ పార్టీ కార్యకర్తలు సుమారు 300 మంది మాజీ డిప్యూటీ సీఎం, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు.