కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

మాజీ ఎమ్మెల్యే ఎస్. ఏ సంపత్ కుమార్

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 29 : గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపితానికే ప్రతి కార్యకర్త కృషి చేయాలని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్. ఏ సంపత్ కుమార్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని మునగాల గ్రామ సమీపంలో కాంగ్రెస్ పార్టీ తాలుకా సమన్వయకర్త లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రగల్భాలు పలుకుతూ పాలన చేస్తుందని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల వాతావరణం సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలు చురుకుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతం, సలహాలు సూచనలకు సంబంధించి పార్టీ శ్రేణులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇటిక్యాల మండల అధ్యక్షుడు నరసింహులు, మానోపాడు ఎంపీపీ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్, రవిప్రకాష్, తదితర కార్యకర్తలు ఉన్నారు