కారు బాంబు పేలి 13మంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి): ఇరాక్‌లో ఉదయం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో కారు బాంబులు పేలి మొత్తం 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పారిశ్రామికవాడ, భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం తదితర రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరిగాయి.