కాశినగరంలో పాముకాటుకు గురై విద్యార్థి మృతి

వరంగల్‌: బచ్చన్నపేట మండలంలోని కాశీనగర్‌ గ్రామంలో శనివారం పాముకాటుకు గురై విద్యార్థి మృతి చెందినది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కల్యాణి(16)తో పాటు ఆమె సోదరులిద్దరు ఇంట్లో నిద్రిస్తుండగా పాముకాటుకు గరైంది. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినది.