కాశ్మీర్‌పై మరింత కఠినం

4

– ఉక్కుపాదంతో అణిచివేయాలని కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి):కాశ్మీర్‌ విషయంలో పాలకులు ముందునుంచి చేస్తూ వచ్చిన తప్పులనే ఇప్పుడు బిజెపి కూడా చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశంలోని విపక్షాలు కూడా బిజెపి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం మాత్రమే తమ ఎజెండాగా పెట్టుకున్నారు. కాశ్మీరీ లోయలో ఇప్పుడు మళ్ళీ భారత వ్యతిరేకత ప్రబలిపోతోంది. కాంగ్రెస్‌ కంటే భిన్నమైన వారమని, దేశానికి ప్రత్యామ్నాయమూ తామేనని  చెప్పి అధికారంలోకొచ్చిన నరేంద్ర మోడీ సర్కారు సైతం పాత ప్రభుత్వాల ధోరణినే కొనసాగిస్తోంది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పిడిపి-బిజెపీ ప్రభుత్వం పీఠం ఎక్కిన తరువాత రాష్ట్రంలో ఇటువంటి ఉద్రిక్తత నెలకొనడం చూస్టుంటే పిడిపి కఠినంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలు ఉన్నాయి. ప్రతి అంశాన్నీ ఇక్కడ తీవ్రవాదులు ఎగదోస్తూ చిచ్చు రేపుతున్నారు.  రాజకీయ లబ్ధికి వీటిని ఉపయోగించు కుంటున్న నేపథ్యంలో మెహబూబా సర్కారు ఎలా ముందుకెళుతుందన్నది వేరుగా చెప్పాల్సిన పనిలేదు.  గత రెండేళ్ళుగా అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్య, కాశ్మీర్‌ పట్ల వివేకవంత మైన వైఖరితో వ్యవహరించలేదు. విజ్ఞతాయుతమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. కాశ్మీర్‌ లోయ ప్రజలతో భారత రాజ్యవ్యవస్థ ఒక ఉద్వేగాత్మక అనుబంధంతో వ్యవహరించడంలో విఫలమయింది. కాశ్మీర్‌ వివాదానికి ఎటువంటి పరిష్కారాన్ని  మానవతా ప్రాతిదికనే కనుగొనాలని వాజపేయి ఆనాడు  స్పష్టం చేశారు. కాశ్మీర్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఆయన కృతనిశ్చయంతో ప్రయత్నించారు. కానీ దానిని ముందుకు సాగనీయలేదు. అయినా కాశ్మీర్‌ ప్రజలు ఆయనకు మద్దతునివ్వడంతో ముందుకు సాగారు. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోయి పర్యాటకుల రాక పెరిగింది. ప్రధాని ప్రయత్నాలు ఫలించాలంటే ప్రతిపక్షం కూడా ఆయనకు బాసటగా ఉండాలి. అయితే కాంగ్రెస్‌ ఆనాడూ వాజపేయికి సహకరించలేదు. కాశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదన్న ఆశాభావం ప్రజల్లో ఏర్పడిందన్న సమయంఓల వెనకడుగు వేసింది. అయితే పక్కలో బల్లెంలా ఉన్న పాక్‌ పాలకులు కాశ్మీర్‌లో ఆజ్యం పోస్తూ ఉగ్రవాదులను ఎగదోస్తున్నారు. భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు ఈ నాటివి కాదు. భారత్‌ నుంచి విడివడ్డ నాటి నుంచి అంటే 1947 నుంచి కుట్రలు పన్నుతూనే ఉంది.  సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి తీవ్రవాదులను దేశం దాటించాలని అక్కడి సైన్యం చూస్తోంది. సరిహద్దుల్లో తీవ్రవాదలును చొప్పించేందుకు సిద్దంగా ఉన్న పాక్‌ సైన్యం కాల్పుల ద్వారా తరచూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దులో పాకిస్థాన్‌ పదేపదే కాల్పులకు తెగబడుతున్న తీరు దాని కుత్సిత బుద్దికి నిదర్శనంగా చెప్పుకోవాలి. పాక్‌కు మాటలతో సమాధానం చెప్పలేమని గతానుభవాలను బట్టి తెలుసుకోవాలి. పాక్‌లో అంతర్గ సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఇలా భార్‌తపైకి దాడులకు దిగుతారు.  పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాదు. తాలిబన్లను పెంచి పోషిస్తున్న పాపానికి ఆ దేశం కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటూనే ఉంది.  ప్రజాస్వామ్యం ముసుగులో సైనిక పాలన సాగడం పాకిస్థాన్‌లోనే కనిపిస్తుంది. ఇవన్నీ కప్పిపుచ్చు కోవడానికి భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుంటోంది. కాశ్మీర్‌ వరదలకు అతలాకుతలమైనపుడు భారత్‌ అందించే సాయాన్ని పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ కూడా పంచుకోవాలని చూస్తే దానికి వేర్పాటు వాదులు అడ్డుపడ్డారు. ఇలాంటి పరిస్థితిని సృష్టించడం అలవాటున్న పాకిస్తాన్‌ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు భారత్‌పై వ్యతిరేకతను తమ ప్రజలకు నూరిపోయాలనే చూస్తుంటాయి.  పాకిస్తాన్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకే కాశ్మీర్‌ విషయంలో ఎప్పుడూ  వివాదం సృష్టిస్తూనే ఉంటారు. భారత్‌ నుంచి విడివడి ఏర్పడిన పాకిస్తాన్‌ మనపై దండెత్తి కాశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది.  ఆక్రమిత కాశ్మీర్‌ ఇప్పటికీ ఈ సమస్యరాజుకుంటూనే ఉంది. ఎన్నోమార్లు అవకాశాలు వచ్చినా ఈ సమస్యను పరిష్కరించడంలో నాటి పండిట్‌ నెహ్రనూ, ఇందిరా గాంధీలు విఫలం కావడంతో అదో రావణ కాష్టంలా రాజుకుంటోంది.  దౌత్య పరంగా తప్పటడుగుల వేయడంతో  భారత్‌కు తిప్పలు తప్పలేదు. ఇప్పటికైనా మోడీ దీని పరిష్కారాన్ని చేతల్లోకి తీసుకోవాలి. లేకుంటా మరింతగా పరిస్థితులు దిగజారగలవు. నిట్‌ వ్యవహరాం కావచ్చు, బురాన్‌వనీ ఎన్‌కౌంటర్‌ కావచ్చు విషయ మేదైనా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దీనిని వాడుకుని లోయలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌,బలూచిస్థానంల విసయంలోమాత్రం పాక్‌ కఠనింగా వ్యవహరిస్తోంది. దానిని ఎండగట్టినప్పుడే సగం విజయం సాదించగలం.