కాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ బంద్‌ 

శ్రీనగర్‌,మే19(జ‌నం సాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీ  కశ్మీర్‌లో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఇంటర్నెట్‌పైనా ఆంక్షలు విధించారు. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. విద్యా సంస్థలను కూడా బంద్‌ చేశారు. వ్యాలీలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శ్రీనగర్‌లోని షేర్‌ ఇ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు అంచెల సెక్యూర్టీని పటిష్టపరిచారు.