కుప్పంలో చంద్రబాబు ముందంజ


టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో  ఉన్నారు. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబు 11,003 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చంద్రబాబుకు 38,532 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి భరత్ కు 27,529 ఓట్లు వచ్చాయి. కుప్పంలో ఇంకా మరో 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలుంది.