కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మ దగ్ధం.

అచ్చంపేట ఆర్సి 29 జూలై ( జనం సాక్షి న్యూస్) : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ పైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే ఖాదర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రసాదించిన సోనియా గాంధీని అవమానించే విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజానికం బాధపడుతుందని కావున బేషరతుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని యెడల రానున్న రోజుల్లో బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నామని హెచ్చరించారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి మాజీ ఎంపీపీ రామనాథం మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మహబూబ్ అలీ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథం యూత్ కాంగ్రెస్ నాయకుడు చందర్, అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు