కేజ్రీవాల్‌పై బూటు విసిరిన ఆగంతకుడు

3

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌పై మరోసారి దాడి జరిగింది.

శనివారం విూడియా సమావేశం లో కేజ్రీవాల్‌ సరి-బేసి ట్రాఫిక్‌

నిబంధనల గురించి మాట్లా డుతుండగా.. ఓ వ్యక్తి ఆయనపై బూటు, సీడీలను విసిరాడు. ఇవి సీఎం పక్కనపడ్డాయి. దీంతో అక్క డున్నవారంతా షాకయ్యారు. కేజ్రీ వాల్‌పై బూటు విసిరిన వ్యక్తిని

పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆమ్‌ ఆద్మీ సేనకు చెందిన వేద్‌ ప్రకా శ్‌గా గుర్తించారు. పోలీసులు నిం

దితుడిని ఐపీ ఎస్టేట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన అనంతరం కేజ్రీవాల్‌ విూడియా సమావేశాన్ని కొనసాగించారు.కేజ్రీవాల్‌పై జరిగిన

దాడిని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఖండించారు. కాగా కేజ్రీవాల్‌పై గతంలో కూడా ఇలాంటి దాడులు

జరిగాయి. 2014లో ఢిల్లీలోని సుల్తాన్‌ పురి ప్రాంతంలో రోడ్డు షో సందర్భంగా ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ చెంప కొట్టాడు. అదే ఏడాది హరియాణాలో మరో వ్యక్తి కేజ్రీవాల్‌ పై దాడికి ప్రయత్నించాడు. ఈ

ఔఏడాది జనవరిలో ఓ మహిళ కేజ్రీవాల్‌పై ఇంకు చెల్లేందుకు ప్రయత్నించింది.