కేటీపీపీ ముందు ఎమ్మార్పీఎస్‌ ధర్నా

వరంగల్‌: భూపలపల్లి వద్ద ఉన్న కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాట్‌ ముందు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో కోంపల్లి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. పవర్‌ ప్లాంట్‌ వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.