కొత్తకోటలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.,.

వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని మున్సిపల్ చైర్మన్ కు ఆదేశించిన జిల్లా కలెక్టర్.,.                                            కొత్తకోట,జనంసాక్షి,జూన్14,.                       కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్ కు వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ఆదేశించారు.కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం సంతృప్తికరంగా ఉందని ఇదేవిధంగా కొత్తకోట అభివృద్ధిలో మున్సిపల్ పాలకమండలి చురుకైన పాత్ర వహిస్తే కొత్తకోట మున్సిపాలిటీ గ్రేడ్ వన్ లో వెళ్తుందని జిల్లా కలెక్టర్ చెప్పడం విశేషం. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ యుగంధర్ రెడ్డి,వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్,కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషినీ విశ్వేశ్వర్,వైస్ చైర్మన్ బీసం జయమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి, పద్మ అయ్యన్న,సంధ్య చింతలపల్లి రవీందర్ రెడ్డి,ఎరుకల తిరుపతయ్య,మాజీ వార్డు సభ్యులు సుభాష్, వినోద్ సాగర్,డాక్టర్ సాజిద్ అలీ, మున్సిపల్ మేనేజర్ రవీందర్, మున్సిపల్ రెవిన్యూ అధికారి రమేష్ నాయక్ తో పాటు శాఖల అధికారులు పాల్గొన్నారు.