కొత్త రైలు సర్వీసులు వాయిదా: దక్షిణ మధ్యరైల్వే

సికింద్రాబాద్‌ : కొత్త రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఈ మేరకు ఒకయ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కావల్సిన నాలుగు కొత్త రైలు సర్వీసులను తాత్కాలిక వాయిదా వేస్తున్నాట్లు వెల్లడించింది. రద్దు అయిన కొత్తరైళ్లలో ఇప్పటికి ఎవరైనా టికెట్లు  రిజర్వు చేసుకొని ఉంటే వారికి పూర్తి డబ్బును వాపసు చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.