కొనసాగుతున్న యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : బదరీనాథ్‌ నుంచి జోషీమఠ్‌ వరకు యాత్రికుల తరలింపు కొనసాగుతోంది. కొద్దిసేపటి నుంచి వాతావరణం అనుకూలించడంతో సైన్యం సహాయక చర్యలను ప్రారంభించింది. బదరీనాథ్‌ నుంచి ప్రైవేటు, వాయుసేన హెలికాప్టర్లలో యాత్రికులను తరలిస్తున్నారు. డెహ్రాడూన్‌ , గౌచర్‌లో వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌన్‌ పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.