కొల్లాపూర్ లో బిజెవైయం తిరంగ బైక్ ర్యాలీ విజయవంతం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు14(జనంసాక్షి):
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆదివారం బిజెవైయం జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర ఆధ్వర్యం లో నిర్వహించిన తిరంగ బైక్ ర్యాలీ విజయవంతం అయింది.
మొదట సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ప్రారంభమైన బైక్ ర్యాలీ కోడేర్,జనుంపల్లి,తీగలపల్లి, పెద్ద కొత్తపల్లి, సాతాపూర్, చెన్నపూరావుపల్లి,కొత్తపేట, కల్వకోల్,కుడికిల్ల,చుక్కయిపల్లి మీదుగా కొల్లాపూర్ పట్టణానికి కి చేరుకోవడం జరిగింది.మార్గం మాద్యమంలో అంబేద్కర్, పూలే,గాంధీజి భగత్ సింగ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తూ ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు,భగత్ సింగ్ వంటి ఎంతో మంది దేశభక్తులు,స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను అర్పించి తెల్లదొరలను దేశం నుండి తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారని అన్నారు. మానవత్వంతో ప్రతి ఒక్కరు ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషించాలని కోరారు. దేశం అన్ని రంగాల లో అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షించారు.
ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నియోజకవర్గనికి చేరుకొని బైక్ ర్యాలీని ముగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్లేని తో పాటు పలువురు రాష్ట్ర,జిల్లా, మండల, బిజెపి, మరియు బీజేవైయం, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.