కోనాపురం లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

కోనాపురం లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

జనం సాక్షి,చెన్నారావు పేట (అక్టోబర్ 18)

మండలంలోని కోనాపురం గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ అద్యక్షులు దొంగల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్, గ్రామ ఎన్నికల ఇంచార్జ్ బుర్రి తిరుపతి హాజరై మాట్లాడుతూ గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అంతర్గత గొడవలు ప్రక్కకు పెట్టి గ్రామంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు.కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వివరించాలని,అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేయాలని  కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత సారంగం, ఎంపీటీసీ మహేందర్,బాణపురం రాజేందర్, బాబురావు,వార్డ్ సభ్యులు చిలువేరు రవి,పురం బసవయ్య,సొసైటీ డైరెక్టర్ అనుముల రవి,మాజీ సర్పంచ్ కాసుల తిరుమలేష్, మాజీ ఎంపిటిసి ఈదుల నర్సయ్య,నర్సింహ రెడ్డి,రాజేశ్వర్ రావు,హరనాథ్,బద్రయ్య,పరికిఅనిల్,రంగారావు,నవీన్,కుమారస్వామి,స్వామి,ఐలుమల్లు,రవి,దొంగలరమేష్, రాజవీర్,శ్రీను,నర్సయ్య, చిన్న రాజేశ్వర్ రావు,నరేశ్, రంజిత్, చిన్న రాజు, శ్రీను,చంద్రయ్య, మల్లయ్య,ఎర్ర రాజు,శశి కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు