కోమాలోకెళ్లిన సరబ్‌జిత్‌సింగ్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌వాసి సరబ్‌జిత్‌సింగ్‌ పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జిత్‌ సింగ్‌పై కోట్‌ లక్‌ పత్‌ జైల్లో నిన్న ఖైదీలు దాడికి దిగడంతో అతని తలకు తీవ్రగాయమైంది.అతన్ని వెంటనే లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం కుదుటపడే వరకు శస్త్రచికిత్స చేయలేమని చెప్పారు.