కోమా నుంచి బయటపడ్డ జెస్పీ రైడర్‌

వెల్లింగ్‌ టన్‌ : న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జెస్సీ రైడర్‌ కోమా నుంచి బయటపడ్డాడు. వెంటిలేటర్‌పై నుంచి అతడిని ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం జెస్సీ రైడర్‌ తన కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అయితే దాడికి సంబంధించిన ఘటనను అతను మరచిపోయాడు. తన చివరి మ్యాచ్‌లో డకౌటైన సంగతి మాత్రం అతనికి గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో రైడర్‌ మరచిపోయినట్లు జెస్సీ మేనేజర్‌ ఆరోన్‌ క్లీ తెలిపారు.