కోవా లక్ష్మన్ ను కలిసిన వరంగల్ బిజెపి నేతలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ కమిటీ సభ్యులు కోవాల లక్ష్మణ్ మంగళవారం వరంగల్ నగరానికి చెందిన బిజెపి నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కొండేటి శ్రీధర్, కొల్లూరు యోగానంద్ తోపాటు తాబేటి వెంకట్, నైనీష్ లు కలిశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మణ్ మాట్లాడుతూ బిజెపి పార్టీ అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా ప్రదీప్ రావు పనిచేయాలని అన్నారు. గెలుపు గుర్రాలకి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో రెండు పర్యాయాలు వరకు కూడా దేశంలో బిజెపి అధికారంలో ఉంటుందని లక్ష్మణ్ తెలిపినట్లు వరంగల్ బిజెపి నేతలు చెప్పారు.