క్రీడలను, రాజకీయలను కలపడం దురదృష్టకరం : శ్రీలంక

ఢిల్లీ : రాజకీయ అంశాలతో క్రీడలను ముడిపెట్టడం దురదృష్టకరమని శ్రీలంక హైకమిషనర్‌ ప్రసాద్‌ కరియవాసం పేర్కొన్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఐపీఎల్‌ చెన్నై మ్యాచ్‌లలో శ్రీలంక క్రీడకారులు ఆడడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఇది దురదృష్టకర అంశమన్నారు. భారత్‌లో శ్రీలంక క్రీడాకారుల భద్రత తమకు మరింత ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు. అయితే చెన్నై మ్యాచ్‌లలో శ్రీలంక క్రీడాకారలు ఆడరని ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటించింది.