క్రీడలు ప్రారంభం

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 8 (జనంసాక్షి)

ఆత్మకూర్ మండలంలోని పల్లెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధిని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు స్వామి క్రీడలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ వెంకటనర్సయ్య లక్ష్మణ్ వెంకటేష్ ఎండి షమీమ్ ఉమా రాణి విజయ తదితరులు పాల్గొన్నారు