క్రీడాంశాలలో భాగంగా ఎంపికైన విజేతలకు జిల్లా స్థాయి కి ఎంపిక

అయిజ,ఆగస్టు 17 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్  గ్రామంలో 75 వసంతాల భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సంబరాల్లో భాగంగా పాఠశాల స్థాయిలో గత వారం నుండి నిర్వహిస్తున్న వివిధ క్రీడాంశాలలో భాగంగా ఎంపికైన విజేతలకు జిల్లా స్థాయి ఎంపికకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉత్తనూర్లో వివిధ క్రీడాంశాలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు  సెలక్షన్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ ఉత్తనూర్ ప్రధానోపాధ్యాయులు తిమ్మారెడ్డి, మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాలల  వ్యాయామ ఉపాధ్యాయులు ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొనడం జరిగింది.