క్రీడా ప్రాంగణం పనులు పరిశీలించిన సర్పంచ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ ప్రతిపాదిత అన్ని పనుల్ని కొనసాగిస్తున్నామని సర్పంచ్ ఎండి. హాబీబుద్దిన్ పేర్కొన్నారు. కొత్తపల్లిలో కొనసాగుతున్న క్రీడా ప్రాంగణ పనుల్ని సర్పంచ్ హాబీబుద్దిన్ పరిశీలించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిధులు కేటాయిస్తోందని అన్నారు. అటు గ్రామంలో నిర్దేశిత ప్రభుత్వ పనుల్ని పూర్తిచేశామని అన్నారు.