క్వెట్టాలో బాంబు పేలుళ్ల: 11 మంది మృతి

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లోని క్వెట్టాలో మరోసారి రక్తమోడింది. వరుస జంట బాంబు పేలుళ్లలో 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి తావ్ర గాయాలయ్యాయి. మృతుల్లో క్షతగాత్రుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.