ఖమ్మంలో మావోయిస్టు దళ సభ్యుడు నందు అరెస్ట్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 02 : చర్ల మండలం వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు దళ సభ్యుడు నందు అలియాస్‌ రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలం ఏఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందు అరెస్ట్‌ను చూపారు. ముగ్గురు గిరిజనులను హత్య చేసిన కేసుతోపాటు రహదారుల ధ్వంసం, చర్ల మండలం సత్యనారాయణపురంలో సెల్‌ టవర్‌ ధ్వంసం కేసులో నందు ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి ఖమ్మం సరిహద్దులో కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌, 208 బెటాలియన్‌లు నిర్వహించిన కూంబింగ్‌లో అనుమానాస్పందంగా కనిపించిన నందును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మావోయిస్టు దళసభ్యుడిగా గుర్తించినట్టు ఏఎస్పీ పేర్కొన్నారు.