ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం – కేసీఆర్..

ఖమ్మం : మణుగూరులో 1,080 మె.వా.సామర్థ్యం గల భద్రాద్రి పవర్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో 24వేల మె.వా.విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. విద్యుత్, సాగునీటి రంగాల్లో ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని, భద్రాచలాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కాళేశ్వరం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోలవరానికి అవసరం లేకపోయినా కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుకున్నారని, ఆ గ్రామాల విలీనంపై ప్రధానితో మాట్లాడుతానని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.