ఖేల్‌ ఖతం దుకాణం బంద్‌..

బీజేపీలో భారాస విలీనం ఖాయం
` ఆ వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌ పదవి
` కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి
` రాష్ట్రంలో హరీశ్‌ ప్రతిపక్ష నేత అవుతారు
` సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
న్యూఢల్లీి(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు ఖండిరచినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్‌ కు గవర్నర్‌ పదవి, కేటీఆర్‌ కు కేంద్రమంత్రి పదవి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్‌ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం, పదవులు రాగానే.. కవితకు నాలుగు రాజ్యసభ సీట్లతో సమానంగా బెయిల్‌ వస్తుందని వెల్లడిరచారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఫుల్‌ బిజీ షెడ్యూల్‌ లో ఉన్నారు. ఈరోజు ఢల్లీిలో ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత దేశంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగంలోని పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ లు సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ చర్చించనున్నారు. వరంగల్‌లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రాహుల్‌ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్‌ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌ ఢల్లీిలోనే ఉండనున్నారు.